News January 23, 2025
కొమురవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

DCM, బైక్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయలైన ఘటన కొమురవెల్లి మండలం ఐనాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బైక్ మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. కొమురవెల్లి ఎస్ఐ రాజు గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News January 8, 2026
చిన్నారుల దత్తత.. అసలు విషయం చెప్పిన శ్రీలీల

నటి శ్రీలీల 2022లో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీనికి గల కారణాలను ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. చిన్న వయసులోనే పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రేరణ ఇచ్చింది ఒక దర్శకుడు అని తెలిపారు. “కన్నడలో ఓ సినిమా చేసేటప్పుడు ఆయన నన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. ఇద్దరని దత్తత తీసుకున్నాను” అని చెప్పారు.
News January 8, 2026
మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాం: ఎస్పీ

వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది.. ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అన్నారు. అపరిచిత వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయండాని సూచించారు.
News January 8, 2026
నగరంలో ఆహార కల్తీని ఉపేక్షించేది లేదు: సజ్జనార్

నగరంలో ఆహార కల్తీని ఉపేక్షించేది లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. సీపీ మాట్లాడుతూ.. వ్యాపారులనే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని, ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ పాసీజర్ను రూపొందించి అమలు చేస్తామన్నారు.


