News March 29, 2025

కొమురవెళ్లి మల్లన్న ఆదాయం రూ.1,11,96,965

image

కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 21 రోజుల్లో రూ.1,11,96,965 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 112 గ్రాముల మిశ్రమ బంగారం, 9 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి, 24 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 20 క్వింటాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, టీజీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 30, 2025

సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

image

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News October 30, 2025

SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.

News October 30, 2025

రేపు వనపర్తిలో 2కే రన్: కలెక్టర్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని 2కే రన్ నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ పరుగు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ముగుస్తుందని తెలిపారు. ఈ రన్‌ను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.