News February 9, 2025

కొయ్యూరు : ఇటుక తలపై జారి పడి బాలుడు మృతి

image

కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ కొత్త బొర్రంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మర్రి రాజుబాబు కుమారుడు భీమేశ్వరరావు(5)పై సిమెంటు ఇటుక పడి మృతి చెందినట్లు సమాచార హక్కు చట్టం జిల్లా కో ఆర్డినేటర్ మర్రి అర్జున్ రెడ్డి ఆదివారం తెలిపారు. బాలుడు గోడ పక్కన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇటుక జారి తలపై పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

Similar News

News December 1, 2025

నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కారం: సబ్ కలెక్టర్

image

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అందించే అర్జీలలోని సమస్యలను నిర్ణయిత వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.

News December 1, 2025

MBNR: అభ్యర్థుల్లో టెన్షన్.. ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులు!

image

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ముగియడంతో, ఇప్పుడు గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ క్రమం ప్రకారం గుర్తులు కేటాయించనున్నారు. ఓటర్లకు సులభంగా అర్థమయ్యే సాధారణ గుర్తులు వస్తే బాగుంటుందని, లేదంటే ఇబ్బంది కలుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు.

News December 1, 2025

భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

image

AP: రాష్ట్రంలో <<18409601>>స్క్రబ్ టైఫస్<<>> వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.