News March 4, 2025

కొయ్యూరు: భార్య కళ్లెదుటే భర్త మృతి

image

కొయ్యూరు మండలం నిమ్మలపాలెం సమీపంలో సోమవారం రోడ్డు<<15637815>> ప్రమాదం<<>> లో వ్యకి మృతి చెందిన విషయం తెలిసిందే. వేనం గ్రామానికి చెందిన పాంగి భానుచందర్ తన భార్య జ్యోతితో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడి భానుచందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జ్యోతిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కళ్లెదుటే భర్త మృతి చెందడంతో ఆమె గుండెలవిసేలా రోధించింది. ఇది చూసిన స్థానికులు కన్నీరు పెటుకున్నారు.

Similar News

News November 27, 2025

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు: కలెక్టర్

image

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించినట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించినట్లు పేర్కొన్నారు.

News November 27, 2025

ద్వారకాతిరుమల: GOOD NEWS.. ఐదేళ్ల నిరీక్షణకు తెర

image

ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయ దర్శనం మరికొద్ది సేపట్లో పునః ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఐదేళ్ల క్రితం నిలిచిపోయిన ఈ దర్శనాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారు. సాధారణ దర్శనం కూడా అమ్మవార్ల వద్ద (దగ్గర) నుంచి ఏర్పాటు చేస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో వీటిని రద్దు చేస్తారు. అంతరాలయ దర్శనం టికెట్ ఒక్కొక్కరికి రూ.500 లు కాగా, రెండు లడ్డూ ప్రసాదాలను అందిస్తామని ఆలయ ఈవో NVSN మూర్తి తెలిపారు.

News November 27, 2025

దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలి?

image

దక్షిణామూర్తి చిత్రపటాన్నిగురువారం రోజున ఇంట్లో ప్రతిష్ఠిస్తే సకల శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గురు గ్రహ ప్రభావం అధికంగా ఉండే ఈరోజున జ్ఞాన స్వరూపుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే విద్యాభివృద్ధి పెరుగుతుందని అంటున్నారు. ‘శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పండుగ రోజులలో విగ్రహ స్థాపన చేయవచ్చు. నిష్ణాతులైన పండితుల సలహా మేరకు ప్రతిష్ఠించడం మరింత శ్రేయస్కరం’ అని చెబుతున్నారు.