News March 4, 2025
కొయ్యూరు: భార్య కళ్లెదుటే భర్త మృతి

కొయ్యూరు మండలం నిమ్మలపాలెం సమీపంలో సోమవారం రోడ్డు<<15637815>> ప్రమాదం<<>> లో వ్యకి మృతి చెందిన విషయం తెలిసిందే. వేనం గ్రామానికి చెందిన పాంగి భానుచందర్ తన భార్య జ్యోతితో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడి భానుచందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జ్యోతిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కళ్లెదుటే భర్త మృతి చెందడంతో ఆమె గుండెలవిసేలా రోధించింది. ఇది చూసిన స్థానికులు కన్నీరు పెటుకున్నారు.
Similar News
News December 26, 2025
కలికిరి: రేపు మాజీ సీఎం రాక

మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి శనివారం రానున్నారు. హైదరాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన 1.15 గంటలకు తిరుపతి రాఘవేంద్ర నగర్లోని రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కలికిరిలోని బీజేపీ కార్యాలయానికి వస్తారని ఆయన పీఏ క్రిష్ణప్ప తెలిపారు.
News December 26, 2025
దత్తాత్రేయునికి 3 తలలు, 6 చేతులు ఎందుకు?

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏక స్వరూపమే దత్తాత్రేయుడు. అత్రి మహర్షి, అనసూయ దేవిల పుత్రుడైన దత్తుని 3 తలలు సృష్టి, స్థితి, లయకారక శక్తికి, ఆరు చేతులు సర్వదిక్కుల వ్యాప్తికి సంకేతాలు. ప్రకృతిలోని 24 అంశాలను గురువులుగా స్వీకరించిన ఈయన విశ్వగురువు. ఆయనను పూజించి అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితాలుంటాయని నమ్మకం. దత్తాత్రేయుని ఆరాధిస్తే అటు గురువు, ఇటు దైవం ఇద్దరి అనుగ్రహం లభించి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.
News December 26, 2025
త్రీమెన్ కమిటీలో రైతులుండాల్సిందే: రైతు JAC

AP: మంత్రులు పెమ్మసాని, నారాయణ, MLA శ్రవణ్లతో కూడిన కమిటీ ఏ ఒక్క అంశాన్నీ పరిష్కరించలేదని అమరావతి రైతు JAC నేతలు విమర్శించారు. కమిటీ ఏ సమాచారమూ ఇవ్వడం లేదన్నారు. పూలింగ్కు ఇవ్వని భూముల్లో కాకుండా వేరే చోట ప్లాట్లు ఇవ్వాలని, గ్రామాల పరిధిలోనే శ్మశానాలుండాలని కోరారు. R5 జోన్ సమస్య మార్చిలోగా పరిష్కరించాలన్నారు. కమిటీలో రైతులనూ చేర్చాలని విన్నవించారు. నిన్న జరిగిన JAC భేటీలో పలు తీర్మానాలు చేశారు.


