News April 14, 2025
కొయ్యూరు మండలంలో గాలివాన బీభత్సం

కొయ్యూరు మండలంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం పలకజీడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని ఛిన్నాభిన్నం చేసింది. వసతి గృహంలో ఇనుప రాడ్స్ అన్నీ విరిగిపోయి, పైకప్పు మొత్తం ఎగిరి పోయిందని వార్డెన్ రాజేశ్వరి సోమవారం ఉదయం తెలిపారు. తనతో పాటు అక్కడే ఉన్న 20మంది విద్యార్థులు వేరే భవనంలోకి పరుగులు తీశామన్నారు.
Similar News
News September 15, 2025
ఉదయగిరి: ఏటీఎం మార్చి నగదు కాజేసిన కేటుగాడు

ఉదయగిరిలో ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన సినిమా హాల్ వీధికి చెందిన ఓ మహిళ తన ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్కి వచ్చింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని కోరింది. దీంతో ఆ వ్యక్తి కొంత డబ్బులు డ్రా చేసి ఆమెకు సంబంధించిన ఏటీఎం కార్డు ఇవ్వకుండా వేరే కార్డు మార్చి అందులోని రూ.8 వేలు నగదును ఆ కేటుగాడు కాజేశారు.
News September 15, 2025
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
News September 15, 2025
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్ను తప్పనిసరి చేస్తూ భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైలు బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి 15నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్లో టికెట్లు బుక్ చేసుకొనే వీలుంటుంది. OCT 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవల తత్కాల్ బుకింగ్స్కు ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా సాధారణ రిజర్వేషన్లకూ వర్తింపజేయనుంది. SHARE IT.