News February 21, 2025

కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

image

కొయ్యూరు మండలంలోని పిట్టచలం గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ మీదు వెళ్తుండగా హైవేపై పక్కన ఉన్న గోతిలో అదుపు తప్పి పడ్డారు. గాయపడిన వారు తోటలూరుకి చెందిన వారిగా తెలిసింది. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. హైవే సిబ్బంది గోతులు తీసి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Similar News

News November 25, 2025

కొడంగల్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

కొడంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ ఢీకొట్టడంతో దాని వెనుక టైర్ల కిందపడి తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు దుద్యాల్ మండలం చిల్ముల్ మైలారం గ్రామానికి చెందిన హన్మయ్య(35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 25, 2025

అన్నమయ్య: నెరవేరిన సీఎం హామీలు

image

అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం(M) దేవగుడిలో ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటించారు. కొందరి బంగారు రుణాలు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆయన ఆదేశాలతో కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందించారు. DMF–CSR నిధుల నుంచి రూ.6.70 లక్షలు విడుదల చేశారు. మాలేపాటి హేమలత రూ.75వేలు, మాలేపాటి ఈశ్వర రూ.1.26లక్షలు, ముంతాజ్ బేగానికి రూ.4.69లక్షల చెక్కులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు.

News November 25, 2025

ఈ నెల 30 వరకు వరుస సమావేశాలు

image

TG: గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తారని CMO తెలిపింది.
25 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై మీట్
26 : లాజిస్టిక్స్‌, సమ్మిట్ ఏర్పాట్లు
27 : మౌలిక వసతులు, అభివృద్ధి
28 : విద్య, యువజన సంక్షేమం
29 : వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం
30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం