News April 6, 2025
కొలిమిగుండ్లలో పండగ పూట విషాదం

కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో శ్రీరామ నవమి రోజు విషాదం నెలకొంది. నందిపాడుకు చెందిన నాగార్జున(16) పదో తరగతి విద్యార్థి బైక్పై తిమ్మనాయినిపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా పొలాల్లో నుంచి దున్నపోతు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 1, 2025
NZB: 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు

NZB జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నయి. రెండేళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీడ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం.
News December 1, 2025
అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.
News December 1, 2025
కరీంనగర్: ‘గ్రానైట్ మాఫియా గుప్పెట్లో గ్రామాలు’

గ్రానైట్ ఇండస్ట్రీస్ ఉన్న గ్రామపంచాయతీ ఎన్నికలను గ్రానైట్ మాఫియా శాసిస్తోంది. తమకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్ బరిలో నిలిపి తెరవెనుక రాజకీయం నడిపిస్తోంది. అభ్యర్థులకయ్యే ఖర్చును గ్రానైట్ మాఫియానే భరిస్తూ గ్రామాలను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుందట. కొత్తపల్లి, గంగాధర, శంకరపట్నం మండలాల్లోని 17 గ్రామాలతో పాటు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు గ్రామాల్లోనూ గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి.


