News April 6, 2025

కొలిమిగుండ్లలో పండగ పూట విషాదం

image

కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో శ్రీరామ నవమి రోజు విషాదం నెలకొంది. నందిపాడుకు చెందిన నాగార్జున(16) పదో తరగతి విద్యార్థి బైక్‌పై తిమ్మనాయినిపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా పొలాల్లో నుంచి దున్నపోతు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 16, 2025

పాలమూరు: మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి గద్వాల జిల్లాలో ఉన్న బాలబాలికల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TGSWRS జిల్లా సమన్వయ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ దరఖాస్తులను ఈనెల 18వ తేదీన సాయంత్రం 05 గంటల లోపు ఎర్రవల్లిలోని TGSWRS, DCO కు సమర్పించాలని సూచించారు.

News October 16, 2025

PHOTO GALLERY: శ్రీశైలంలో PM మోదీ

image

AP: ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న సేవలో తరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. శ్రీశైల ఆలయంలో మోదీ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News October 16, 2025

మద్దూరు: చెరువులో వ్యక్తి మృతి.. UPDATE

image

మద్దూరు పట్టణ కేంద్రంలో సంకం చెరువులో ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి మృతదేహం పైకి తెలిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా వట్‌పల్లి గ్రామానికి చెందిన శేఖర్(42) మద్దూరులో రవి స్క్రాప్ షాపులో పనిచేస్తున్నాడు. 6 రోజుల శనివారం తెల్లవారుజామున కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు ఆయన చెరువులో మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.