News February 8, 2025

కొలిమిగుండ్ల వద్ద ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

image

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వెళ్లేందుకు బస్సు ఎక్కారు.  కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు. 

Similar News

News March 6, 2026

ఖమ్మం జిల్లాలో 99 డేస్ యాక్షన్ ప్లాన్ షెడ్యూల్

image

☆ MAR 6 నుంచి MAR 15 వరకు పారిశుద్ధ్యం, ఫైల్స్ క్లీయరెన్స్
☆ APR 6 నుంచి APL 11 వరకు వైద్య శాఖ
☆ APR13- 18 వరకు రోడ్ సేఫ్టీ
☆ APR 20-26 వరకు SC, ST, BC, మైనారిటీ సంక్షేమం, హౌసింగ్
☆ APR 27 నుంచి MAY 2 వరకు చైల్డ్ సేఫ్టీ, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు
☆ మే 4-10 వరకు అగ్రికల్చర్
☆ మే 11-16 వరకు విద్య
☆ మే 18-23 వరకు క్రీడలు
☆ మే 25-30 వరకు మహిళా సంక్షేమం
☆ జూన్ 1-12 వరకు పర్యావరణం

News March 6, 2026

99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలి: వాకిటి

image

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని ఉమ్మడి ఖమ్మం ఇన్‌ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆర్థికస్థితిగతులు సహకరించక పోయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల గడపకు చేరేలా అధికారులు కృషిచేయాలని శుక్రవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో చెప్పారు. రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలని పేర్కొన్నారు.

News March 6, 2026

నిజామాబాద్: సమాజ అభివృద్ధికి తోడ్పడదాం: మంత్రి సీతక్క

image

మహిళలకు అవకాశాలు ఇవ్వటం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడతామని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతకు అవగాహన సదస్సును నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళా సాధికారతకు పాటుపడదామని పిలుపునిచ్చారు.