News March 19, 2024
కొల్గూరులో చెట్టు విరిగిపడి బాలుడి మృతి

గజ్వేల్ మండలం కొల్గూరులో విషాధచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి చింటూ(15) వ్యవసాయ పొలం వద్ద గల పశువులను ఇంటికి తీసుకువస్తుండగా, భారీ గాలికి చెట్టు విరిగి అతడిపై పడింది. ఈ ప్రమాదంలో చింటూ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 2, 2025
MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


