News February 17, 2025

కొల్చారం: బైక్, ఆర్టీసీ బస్సు ఢీ.. యువకుడి మృతి

image

కొల్చారం శివారులో అదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో బైక్ పై ఉన్న కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన రాజేందర్(27) అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ నుంచి తన స్వగ్రామం కన్నారం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు.

Similar News

News February 22, 2025

సిద్దిపేట: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

image

సిద్దిపేటలో వ్యక్తి<<15521843>> హత్య కేసు<<>>ను పోలీసులు ఛేదించారు. హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు ACP మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు కరీంనగర్ జిల్లాకు చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు.

News February 22, 2025

అంద‌రికీ రుణ‌మాఫీ.. అదో అంద‌మైన క‌ట్టుక‌థ: హ‌రీశ్‌రావు

image

సీఎం రేవంత్‌పై హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇప్ప‌టికీ చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కాలేద‌ని, రైతుల నుంచి తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మవుతున్నాయ‌ని ఆయన అన్నారు. గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగిన రైతు విష‌యంలో హ‌రీశ్‌రావు స్పందించారు. అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టు కథను ప్రచారం చేస్తున్న మిమ్మల్ని నిలదీసేందుకు గాంధీభవన్ దాకా వచ్చిన రైతుకు ఏం సమాధానం చెబుతారు అని హ‌రీశ్ నిల‌దీశారు.

News February 21, 2025

మెదక్‌లో గ్రాడ్యుయేట్స్ 12,472, టీచర్స్ 1,347 ఓటర్లు

image

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉన్నారు. ఇందులో 8,879 మంది పురుషులు, 3,593 మహిళలున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. ఇందులో పురుషులు 7,99 మంది, మహిళలు 5,48 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!