News April 21, 2024
కొల్లాపూర్: బస్తాలు మోసిన RS ప్రవీణ్ కుమార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713681279977-normal-WIFI.webp)
కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బస్తాలు మోశారు. హమాలీలతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. అలాగే స్థానిక ప్రజలతో మమేకమవుతూ.. ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, కూరగాయలు మార్కెట్లో ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 26, 2024
MBNR: నేడు జిల్లాకు కేంద్రమంత్రి రాక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735133727420_52070028-normal-WIFI.webp)
నర్వ మండలం రాయి కోడ్ గ్రామానికి, గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ వస్తున్నట్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. నర్వ మండల, గ్రామాల బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
News December 26, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735143508802_19518427-normal-WIFI.webp)
✔ఘనంగా క్రిస్మస్ వేడుకలు✔ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి✔NGKL: పోలీస్ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు✔వనపర్తి: అయ్యప్ప ఆలయంలో స్వచ్ఛభారత్✔ఒకవైపు ముసురు..మరోవైపు చలి✔CM ఇలాకాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు✔NRPT: మూడు రోజులు త్రాగునీటి సరఫరా నిలిపివేత✔సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దు:SPలు✔PUలో క్రీడాకారులకు ట్రాక్ సూట్, యూనిఫామ్స్ అందజేత
News December 25, 2024
ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735122502760_50179526-normal-WIFI.webp)
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూల బోకే అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.