News April 15, 2025

కొల్లాపూర్: ‘స్థానిక ఎన్నికల్లో BRS గెలుపు ఖాయం’

image

మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే రజతోత్సవ సభతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS అభ్యర్థులు గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే BRS సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Similar News

News December 10, 2025

MBNR: అతిథి అధ్యాపక పోస్టుకు నోటిఫికేషన్

image

మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.కె.పద్మావతి తెలిపారు. సంబంధించిన పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 11 నుంచి 12 వరకు అందజేయాలని తెలిపారు.

News December 10, 2025

వనపర్తి: ‘మూడు నెలల జీతాలు పెండింగ్’

image

3నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లు DM&HO డా.సాయినాథ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జీవో 1195 ప్రకారం ప్రతి ఉద్యోగికి రూ.19,500 చెల్లించాలని, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 11 నుంచి 19ఆన్‌లైన్ వర్క్ బంద్ చేస్తున్నట్లు, 19లోపు వేతనాలు ఇవ్వని పక్షంలో 20 నుంచి నిరవధిక సమ్మే చేస్తామన్నారు.

News December 10, 2025

విశాఖలో టెట్ పరీక్షకు తొలిరోజు 91.05% హాజరు

image

విశాఖలో బుధవారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 2001 మంది అభ్యర్థులకు గానూ 1822 మంది (91.05%) హాజరయ్యారు. పరీక్షల సరళిని డీఈవో స్వయంగా 2 కేంద్రాల్లో తనిఖీ చేయగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 5 కేంద్రాలను సందర్శించి పరిశీలించింది. ఉదయం 5 కేంద్రాల్లో, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.