News April 11, 2025
కొల్లిపర: బాలికపై అత్యాచారయత్నం. 20ఏళ్ల జైలు శిక్ష

కొల్లిపురం మండలం దావులూరుకి చెందిన పి. సురేశ్ (53) 4ఏళ్ల బాలికపై 2021లో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి కొల్లిపర ఎస్ఐ బలరామిరెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన దిశా ఎస్ఐ సంజయరాణి ఆధారాలు సమర్పించగా, తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు.
Similar News
News October 24, 2025
చిచ్చర పిడుగు.. 17 ఏళ్లకే ప్రపంచ మేధావిగా గుర్తింపు

పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి కరెక్ట్గా సూటవుతుంది ఈ కుర్రాడికి. 4 ఏళ్ల వయసులో కంప్యూటర్పై పట్టు సాధించి 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్, 17 ఏళ్లకి Ai ఇంజినీర్గా రాణిస్తూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. అతడే ఆసియాలోనే యంగెస్ట్ డేటా సైంటిస్ట్ పిల్లి సిద్ధార్ద్ శ్రీ వాత్సవ. తెనాలి ఐతానగర్కు చెందిన ప్రియమానస, రాజకుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్ద్ నేడు టోరీ రేడియో లైవ్ ఈవెంట్లో పాల్గొంటున్నాడు.
News October 24, 2025
సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పించాలి: ఎస్పీ

ప్రజలకు సైబర్ నేరాలు, మోసాల పట్ల అవగాహన కల్పించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రామ/ వార్డు మహిళా పోలీసులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసులు తమ పరిధిలోని ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లు, అవగాహన బ్రోచర్లను ఆయన విడుదల చేశారు.
News October 23, 2025
గుంటూరులో పురాతన అగస్త్యేశ్వరస్వామి ఆలయం

గుంటూరు RTC బస్ స్టాండ్కు సమీపంలో అగస్త్యేశ్వరస్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. చాళుక్యుల సామంతులైన పరిచ్ఛేద వంశానికి చెందిన పండయ్యరాజు దీనిని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఈ శివలింగాన్ని వేలాది సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చతురస్రాకారంలో శివలింగం దర్శనమిస్తుంది. ఆలయ ముఖ మండప స్తంభాలు చాళుక్యుల శిల్పకళా వైభవానికి నిదర్శనం.


