News October 16, 2024

కొవ్వూరులో షేర్ యాప్ పేరిట భారీ మోసం

image

కొవ్వూరు టౌన్‌కు చెందిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ శ్రీనివాస్ షేర్ యాప్ ద్వారా రూ.29.30 లక్షలు పోగొట్టుకున్నాడని టౌన్ సీఐ విశ్వం మంగళవారం తెలిపారు. శ్రీనివాస్ ఇన్స్టాగ్రామ్‌లో మోతిలాల్ అశ్వాల్ ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అనే షేర్ మార్కెట్ యాప్ ద్వారా 4 బ్యాంకు ఖాతాలకు రూ.29.30 లక్షలను చెల్లించారన్నారు. తన షేర్స్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా జమ కాలేదన్నారు. కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News October 23, 2025

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో రానున్న 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి
గురువారం అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299219 ఏర్పాటు చేశామన్నారు.

News October 23, 2025

రేపు పాఠశాలలకు సెలవు: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటిస్తూ కలెక్టర్ నాగరాణి
గురువారం ఆదేశాలు జారీ చేశారు. పిడుగుపాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, చెరువుల దగ్గరగా ఉండకుండా అందరికీ సమాచారం అందించాలన్నారు. రియల్ టైమ్ సమాచారం వస్తుందని, దానిని ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News October 23, 2025

PM ఆవాస్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

image

PM ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలోని 319 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించాలన్నారు. అర్హులుగా ఉండి, సొంత స్థలం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.