News January 26, 2025
కొస్గికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో జరుగుతున్న ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను చంద్రవంచ గ్రామంలోని లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి సభకు హాజరయ్యారు.
Similar News
News November 17, 2025
భూపాలపల్లి: ‘బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి’

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో బయోమెట్రిక్ హాజరు నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..శాఖల వారీగా బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ, బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
News November 17, 2025
భూపాలపల్లి: ‘బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి’

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో బయోమెట్రిక్ హాజరు నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..శాఖల వారీగా బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ, బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
News November 17, 2025
సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలి: భూపాలపల్లి కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో ప్రజల నుంచి ఆయన 37 దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. తదుపరి ప్రజావాణి వరకు జీరో పెండింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.


