News January 26, 2025
కొస్గికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో జరుగుతున్న ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను చంద్రవంచ గ్రామంలోని లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి సభకు హాజరయ్యారు.
Similar News
News December 6, 2025
గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.
News December 6, 2025
కేంద్ర మంత్రి రామ్మోహన్పై విమర్శలు.. తిప్పికొట్టిన ఎంపీలు

ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తోటి MPలు మద్దతుగా నిలిచారు. ‘రామ్మోహన్ UDAN పథకాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల కొత్త ఎయిర్లైన్స్కు అవకాశాలు వస్తాయి. ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. సంక్షోభాల్లో విమానయాన సంస్థలను జవాబుదారీగా చేశారు. ప్రయాణికులకు అండగా నిలబడ్డారు’ అని పెమ్మసాని, లావు ట్వీట్లు చేశారు.
News December 6, 2025
అమలాపురం: అంబేడ్కర్కు నివాళులర్పించిన కలెక్టర్

సంఘటిత భారతదేశానికి అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే పునాది అని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. శనివారం అమలాపురంలో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ముఖ్యంగా యువత ఆయన బోధనలు, ఆశయాలను తప్పక ఆచరించాలని కలెక్టర్ సూచించారు.


