News January 26, 2025

కొస్గికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

image

నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో జరుగుతున్న ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను చంద్రవంచ గ్రామంలోని లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి సభకు హాజరయ్యారు.

Similar News

News February 7, 2025

గుర్రంపోడు: ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

ఉరేసుకొని వ్యక్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన గుర్రంపోడు మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధు వివరాల ప్రకారం.. పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి పవన్(18) డీజె సిస్టం ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి కుటుంబీకులతో కలిసి నిద్రించాడు. కాగా శుక్రవారం లేచి చూసేసరికి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబీకులు గుర్తించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News February 7, 2025

గోకవరంలో కాకినాడ జిల్లా యువకుడి మృతి

image

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో కొత్తపల్లి నుంచి కామరాజుపేటకు వెళ్లే జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన సతీష్ (18)గా పోలీసులు గుర్తించారు. సతీష్ అమ్మమ్మ ఊరైన కామరాజుపేటకి తన స్నేహితుడితో వచ్చాడని, అంతలోనే ప్రమాదం జరిగి చనిపోయాడని SI పవన్ కుమార్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News February 7, 2025

గురుకులాల్లో ప్రవేశాలు.. ముగిసిన దరఖాస్తు గడువు

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. 643 గురుకులాల్లో మొత్తం 51,968 సీట్లు ఉండగా, 1.67లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఐదో తరగతికే 88,824 అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా, మే 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.

error: Content is protected !!