News February 11, 2025
కోకోకు ధర కల్పించాలంటూ సీఎం దృష్టికి..

అంతర్జాతీయ మార్కెట్కు తగ్గట్టుగా కోకోకు ధర కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబును కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కోకో రైతులతో ఆయన స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. ఎమ్మెల్యే వెంట వట్టికూటి వెంకట రామారావు, గారపాటి శ్రీనివాస్, వీర్రాజు ఉన్నారు.
Similar News
News February 8, 2026
ఉప ఉత్పత్తులపై మిల్లర్లు దృష్టి పెట్టాలి: కలెక్టర్

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పెదఅమిరంలో శనివారం రైస్ మిల్ యజమానులు, పరిశ్రమ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్లింగ్లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా బలపడవచ్చని తెలిపారు. బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మిల్లర్లు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 8, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్ సీహెచ్ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News February 8, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్ సీహెచ్ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


