News January 10, 2025
కోటగుళ్ళలో ముక్కోటి శోభ
గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం కోటగుళ్ళలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నందీశ్వరుని పూజతో మొదలుకొని స్వామివారికి రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News January 13, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్
> WAY2NEWSతో వర్ధన్నపేట MLA నాగరాజు > గట్టమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి > HNK: పథకాలపై మంత్రి పొంగులేటి సమీక్ష > MHBD: అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుంది: ప్రభుత్వ విప్ > MLG: నెల రోజుల్లో మేడారం జాతర > JN: జిల్లా వ్యాప్తంగా ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు > ఐనవోలు: భక్తులకు అసౌకర్యం కలగకుండా: MLA నాగరాజు
News January 12, 2025
ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళీ అమ్మవారు
వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు ఆదివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
News January 12, 2025
న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలి: హైకోర్టు జడ్జి
ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి& జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి బి.విజయసేన్ రెడ్డి అన్నారు. శనివారం చేర్యాలలో ఫస్ట్ క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ప్రారంభించారు. చేర్యాల, కొమరవెల్లి, ధూల్ మిట్ట, మద్దూర్ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు మేము బాధ్యతగా చేర్యాల పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.