News May 20, 2024

కోటపల్లి: పట్టుబడిన అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు

image

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్‌ పల్లి, సిరోంచ వంతెన చెక్‌పోస్టు వద్ద సోమవారం అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో చిరుతపులి చర్మం తరలిస్తున్న దుర్గం పవన్‌, బాబర్ ఖాన్‌ను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి చిరుతపులి చర్మంతో పాటు రెండు మోటారు సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News October 23, 2025

ఉట్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

image

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్ పల్లి ఐబీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఎదురెదురుగా బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన అంకన్నతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 23, 2025

ఆదిలాబాద్: కరాటే మాస్టర్లు…ఇది మీకోసమే

image

విద్యార్థులకు కరాటే శిక్షణ నేర్పడానికి కరాటే మాస్టర్లు ఈనెల 23 నుంచి 30 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో పాఠశాల వారీగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్థానికత, బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్, పూర్వపు అనుభవం వారి ప్రతిభ ఆధారంగా కరాటే మాస్టర్లను ఎంపిక చేస్తామన్నారు. మహిళా కరాటే మాస్టర్లకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

News October 23, 2025

వయోవృద్ధులకు సేవ చేయడమే నిజమైన పూజ: కలెక్టర్

image

బోరిగామ జడ్పీఎస్‌ఎస్‌లో ‘ఆరోగ్య పాఠశాల’లో భాగంగా, ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ నిర్వహించిన ‘గ్రాండ్‌ పేరెంట్స్‌ పాద పూజ’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. వయోవృద్ధులకు సేవ చేయడమే నిజమైన పూజ అన్నారు. అనంతరం వృద్ధుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై జరిగిన వర్క్‌షాప్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో డీడబ్ల్యూఓ మిల్కా, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.