News February 28, 2025

కోటప్పకొండ తిరునాళ్లలో వైసీపీ విద్యుత్ ప్రభపై దాడి

image

కోటప్పకొండ తిరునాళ్లలో గోనెపూడి వైసీపీ ఎలక్ట్రికల్ ప్రభపై కొందరు దాడి చేసి ప్రభకు నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండ కింద ఏర్పాటు చేసిన 22 ఎలక్ట్రికల్ ప్రభలలో ఒకటి మాత్రమే వైసీపీ ప్రభ ఉంది. ఈ ఘటన సమయంలో వైసీపీ ప్రభ దగ్గరకు వైఎస్సార్ అభిమానులు భారీగా చేరుకున్నారు. తిరునాళ్లలో గోనెపూడి ప్రభ వద్ద జగన్ పాటలు వేయడంతో ప్రత్యర్థులు డీజే బాక్స్‌లను ధ్వంసం చేశారన్నారు. 

Similar News

News March 25, 2025

పెనుగంచిప్రోలు: పురుగుమందు తాగి వ్యక్తి మృతి

image

పెనుగంచిప్రోలుకు చెందిన వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని దేవరుప్పుల మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సృజన్ కుమార్ కథనం మేరకు.. బత్తుల గోపి సీతారాంపురం గ్రామంలోని ఇటుక బట్టీలో పని చేయడానికొచ్చాడు. కాగా మద్యం తాగడం కోసం తన భార్యను రూ.200 అడగగా ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగగా.. గోపి మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు.

News March 25, 2025

‘గూగుల్’ గురించి ఈ విషయం తెలుసా?

image

‘గూగుల్’ కంపెనీ తన ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు కోసం అమలు చేస్తోన్న ఓ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. ఆ కంపెనీ ఉద్యోగి మరణిస్తే వారి భాగస్వామికి పదేళ్ల పాటు 50శాతం శాలరీని ఇస్తోంది. అలాగే వారి పిల్లల్లో ప్రతి ఒక్కరికీ 19 ఏళ్లు వచ్చేవరకు నెలకు $1,000 (రూ.84వేలు) అందిస్తోంది. ఉద్యోగి కుటుంబం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కంపెనీ అండగా నిలవడం గ్రేట్ అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. మీరేమంటారు?

News March 25, 2025

నేరస్థులకు శిక్ష పడేలా చూడాలి: నల్గొండ ఎస్పీ

image

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు అభినందన సభ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గడిచిన సంవత్సర కాలంలో ఒకరికి ఉరి, 17 మందికి జీవిత ఖైదు విధించడం జరిగిందని తెలిపారు. నిందితులను దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా చేయాలని కోరారు. కోర్టు అధికారులు ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు అడిగి పనిచేయాలన్నారు. నిందితులను సకాలంలో కోర్టులో హాజరుపరచాలన్నారు.

error: Content is protected !!