News August 13, 2024
కోటబొమ్మాలి: స్వాతంత్ర్య వేడుకలకు రైతుకు ఆహ్వనం

మండలంలోని నిమ్మాడ గ్రామానికి చెందిన రైతు దాము మోహనరావు, పుణ్యవతి దంపతులకు పీఎం కిషన్ పథకంపై ఈ నెల ఆగస్టు 15న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర వేడుకలకు నిమ్మాడకు చెందిన ఈ దంపతులకు ఆహ్వనం అందినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి పాల్గొనే వేడుకలకు ఓ సాదరణ రైతుకు ఆహ్వనం అందడంపై మండల వ్యవసాయ అధికారి సువ్వారి గోవిందరావు, పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 28, 2025
SKLM: మైనారిటీ యువతకు జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు

నిరుద్యోగ మైనారిటీ యువతకు జర్మనీలో ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి ఉరిటి సాయికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐలో 2 సంవత్సరాలు, డిప్లోమాలో 3 సంవత్సరాలు అనుభవం ఉన్న యువకులు అర్హులన్నారు. నవంబర్ 2వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99888 53335 నంబర్కు సంప్రదించాలని తెలియజేశారు.
News October 28, 2025
SKLM: ‘ఆపత్కాలంలో అధికారుల సమన్వయం కీలకం’

మొంథా తుఫాను ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా, జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధర బాబుతో కలిసి సోమవారం క్షేత్ర పర్యటన ముగించుకున్న అనంతరం, కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా డెలివరీ తేదీలు దగ్గర పడిన గర్భిణీలకు వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు.
News October 28, 2025
శ్రీకాకుళం టుడే టాప్ హెడ్ లైన్స్ ఇవే

➫శ్రీకాకుళం జిల్లాపై మొంథా తుఫాన్ ప్రభావం
➫తుఫాన్ పై అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
➫శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు
➫మెండపేట-రాళ్లపేట రహదారి గుంతలమయం
➫శ్రీకాకుళం:చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
➫తుఫాన్ ప్రభావంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
➫పొందూరు, ఎల్.ఎన్ పేటలో నేలమట్టం అయిన వరి పంట


