News February 9, 2025
కోటబొమ్మాళి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతూ సంతబొమ్మాళికి చెందిన రామారావు శనివారం కన్నుమూశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం..అతను జనవరి 28న భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడగగా .. మందలించిందని విషం తాగాడు. గమనించిన రామారావు కుమారుడు కుటుంబీకులకు సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News February 7, 2026
SKLM: ‘APPSC పరీక్షలు నిర్వాహణలో లోపాలు జరగరాదు’

APPSC పరీక్షల నిర్వాహణలో లోపాలు జరగరాదని జిల్లా రెవిన్యూ అధికారి లక్ష్మణ మూర్తి అన్నారు. శనివారం శ్రీకాకుళం కలెక్టర్ సమావేశ మందిరంలో సంబందిత అధికారులుతో సమావేశం నిర్వహించారు. ఫారెస్ట్ బీట్ అధికారి, అసిస్టెంట్ బీట్ అధికారి, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3, తానేదార్ ఇన్ ఫారెస్ట్ సబార్డినేట్ పరీక్షలు జరుగుతాయాన్నారు. ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు జరుగే ఈ పరీక్షలకి 1375 మంది హాజరువుతారన్నారు.
News February 7, 2026
ఎచ్చెర్ల: ఈ కోర్సులకు ఎందుకు డిమాండ్..?

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు గత కొన్నేళ్లుగా శత శాతం ప్రవేశాలు జరుగుతున్నాయి. సైన్స్ విభాగంలోని కోర్సులకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలైటికల్ కెమిస్ట్రీ. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ. కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉండటం, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగాలకు ఈ కోర్సులు మార్గం చూపడమేనని విద్యార్థులు చెబుతున్నారు.
News February 7, 2026
ఎచ్చెర్ల: అందుబాటులో 16 పీజీ కోర్సులు

పీజీ కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో గత ఏడాది 16 కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ఈ పీజీ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డికి అడ్డయ్య కోరారు.


