News August 31, 2024
కోటబొమ్మాళి: నిన్న పదోన్నతి.. నేడు పదవి విరమణ

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన డీఎస్సీపీ కింజరాపు ప్రభాకర్ రావు విశాఖపట్నంలో విధులను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో డీఐజీ ఆదేశాల మేరకు పలువురు డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ ఏఎస్పీలుగా నియమించారు. ఈ క్రమంలో డీఎస్పీగా విశాఖలో విధులు నిర్వహిస్తున్న కింజరాపు ప్రభాకర్ రావు శుక్రవారం ఏఎస్పీగా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ క్రమంలో నేడు పదవీ విరమణ చేయనున్నడటం విశేషం.
Similar News
News December 19, 2025
శ్రీకాకుళం: ఒకే కళాశాల నుంచి 25 మందికి అగ్నివీర్ ఉద్యోగాలు

విశాఖ, కాకినాడలో ఆగస్టు నెలలో జరిగిన అగ్నివీర్ రిక్రూట్మెంట్లో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు సత్తాచాటారు. ఈ అగ్నివీరు రిక్రూట్మెంట్లో 25 మంది ఉద్యోగాలు సాధించినట్లు ఇటీవల కాల్ లెటర్స్ వచ్చాయని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, NCC అధికారి పోలినాయుడు తెలిపారు. వీరిని శుక్రవారం అభినందించారు. NCCలో నైపుణ్య శిక్షణ, క్రమశిక్షణ, దేహదారుఢ్య శిక్షణ విద్యార్థులకు ఉపయోగపడిందన్నారు.
News December 19, 2025
ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://brau.edu.inలో పొందుపరిచినట్లు తెలిపారు. మొత్తం 178 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
News December 19, 2025
నరసన్నపేట: విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న DEO

నరసన్నపేటపేట మండలం సత్యవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం DEO రవిబాబు సందర్శించారు. అనంతరం ఉపాద్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులతో కలిసి విన్నారు. విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, పాఠశాలలోని పలు రికార్డులు పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.


