News April 9, 2025
కోటబొమ్మాళి: ‘పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టండి’

పర్యాటక రంగానికి ప్రభుత్వం పరిశ్రమ హోదాను ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాళిలో పర్యాటక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టెక్కలిలో పట్టు మహాదేవ్ కోనేరు, భావనపాడు బీచ్ ఆధునీకరించాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News December 16, 2025
శ్రీకాకుళం: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.
News December 16, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 46 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. మొత్తం 46 అర్జీలు స్వీకరించామన్నారు.
News December 16, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 46 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. మొత్తం 46 అర్జీలు స్వీకరించామన్నారు.


