News March 18, 2025

కోటబొమ్మాళి: బంధువులకు విద్యార్థి అప్పగింత

image

కోటబొమ్మాళి మండలంలోని జగనన్న కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థి ఆదివారం పరారైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్‌లో బాలుడి ఆచూకీ దొరికింది. వాట్సాప్ పోస్టుల ద్వారా ఓ వ్యాపారి బంధువులకు విషయాన్ని తెలియజేశాడు. అనంతరం విద్యార్థి పిన్ని వచ్చి తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు.

Similar News

News March 18, 2025

శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాల పనివేళలు ఇవే.. 

image

అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి. శాంతి శ్రీ మంగళవారం తెలిపారు. వేసవి దృష్ట్యా మార్చి నెల 18వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు సమయం మార్చినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు వేడి ఆహారం ఇచ్చి పిల్లలను వారి వారి గృహాలకు పంపాలని ఆమె తెలిపారు.

News March 18, 2025

కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయసు 50 – 55 సంవత్సరాలు మధ్య ఉంటుందన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2025

SKLM: కంప్యూటర్ శిక్షణను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

image

ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. నగరంలోని జడ్పీ మందిరంలో 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. నూతనంగా వస్తున్న సాంకేతికతను అలవర్చుకొని నైపుణ్యాభివృద్థి చేసుకోవాలన్నారు.

error: Content is protected !!