News April 14, 2025

కోటవురట్ల: మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతులకు ఆదివారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు, పోస్టుమార్టం నిర్వహించగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తొందరగా ముగించారు.

Similar News

News November 9, 2025

మొంథా తూఫాన్ నష్టం నివేదిక అందించండి: మంత్రి పొన్నం

image

మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నిర్నిత నమూనాలో తుఫాన్ నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని అదేశించాలన్నారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్లు ఎంత మేరకు మరమ్మతులకు అవసరమో తెలుపలాన్నారు.

News November 9, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు బాగుపడేదెన్నడో..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు గుంతలమయంగా మారి, ప్రయాణం నరకంగా మారింది. గతంలో కొందరు నేతలు రోడ్లపైకి వచ్చి గళమెత్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం మినహా క్షేత్రస్థాయిలో రోడ్ల సమస్యకు పరిష్కారం లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతలు పట్టించుకొని రోడ్లను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

News November 9, 2025

మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

image

జనాబ్‌ మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.