News April 14, 2025
కోటవురట్ల: మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

కోటవురట్ల మండలం కైలాసపట్నం మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతులకు ఆదివారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు, పోస్టుమార్టం నిర్వహించగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తొందరగా ముగించారు.
Similar News
News February 26, 2026
BREAKING: అర్ధరాత్రి ఆసిఫాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు

ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, బెజ్జూర్ తదితర మండలాల్లో బుధవారం అర్ధరాత్రి 11:50 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని వస్తువులు కదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.
News February 26, 2026
నెల్లూరు: మీ ఏరియాలో పాలు బాగుంటాయా?

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు చనిపోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తిస్తున్నారు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉండగా.. వీటిల్లో తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు. మీ దగ్గర పాలు బాగుంటాయా? లేదా?
News February 26, 2026
వేములవాడ: మార్చి 6న శివ కల్యాణోత్సవం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్చి 6వ తేదీన పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల భాగంగా రెండవ రోజు పార్వతి రాజరాజేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 1వ తేదీ ఆదివారం సాయంత్రం కామదహహనం, 3 రోజులు డోలోత్సవం అంతర్గతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.


