News April 14, 2025

కోటవురట్ల: మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతులకు ఆదివారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు, పోస్టుమార్టం నిర్వహించగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తొందరగా ముగించారు.

Similar News

News November 28, 2025

BREAKING.. సిరిసిల్ల: మాజీ నక్సలైట్ దారుణ హత్య

image

సిరిసిల్ల(D) తంగళ్లపల్లి(M) గండిలచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అనే మాజీ నక్సలైట్ దారుణహత్యకు గురయ్యారు. నర్సయ్య తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్.. పథకం ప్రకారం సిరిసిల్ల సమీపంలోని అగ్రహారం గుట్టలకు పిలిపించి హతమార్చి JGTL పోలీసులకు లొంగిపోయారని సమాచారం.

News November 28, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన: RTI కమిషనర్
✓ పాల్వంచ: బాల్య వివాహ రహితంగా భద్రాద్రిని మార్చాలి
✓ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ
✓ సైన్స్ ఫెయిర్ వల్ల విద్యార్థులకు మేలు: కలెక్టర్
✓ అశ్వాపురం: లోన్ ఇప్పిస్తానని మోసం.. బాధితుల నిరసన
✓ ఏర్పాట్లను పరిశీలించిన భద్రాద్రి జిల్లా ఎన్నికల పరిశీలకులు
✓ లక్ష్మీదేవిపల్లి: టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: UTF

News November 28, 2025

జగిత్యాల: సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణపై అధికారులు మార్గనిర్దేశం

image

వైజ్ఞానిక ప్రదర్శన రెండు రోజులు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు వివిధ కమిటీలను ఏర్పాటుచేసి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు JGTL జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు విధులు స్పష్టంగా వివరించి, నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు. సెక్టారియల్ అధికారి రాజేష్, మల్యాల విద్యాధికారి జయసింహారావు, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.