News February 3, 2025
కోట్ పల్లి: పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

పార్టీ పటిష్టతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంతోష రాజు ఎంపిక కావడంతో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి నియామక పత్రాన్ని వారికి అందజేశారు. మహిళలను భాగస్వామ్యం చేస్తూ పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు.
Similar News
News November 10, 2025
సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండరీ ఆసుపత్రులుండగా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుపత్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్దరు చొప్పున, మరో 13 ఏరియా ఆసుపత్రులకు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుపత్రులకు ఇద్దరు చొప్పున స్పెషలిస్టులను నియమించారు. మరో 97 ఆసుపత్రులకు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.
News November 10, 2025
సైబరాబాద్ వ్యాప్తంగా 529 మందిపై కేసు నమోదు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించారు. 529 మందిపై కేసు నమోదు చేశారు. 417 బైకులు, 24 త్రీ వీలర్స్, 88 కార్లతో పాటు పలు వాహనాలను సీజ్ చేశారు. 20 నుంచి 30 ఏళ్ల వయసు గలిగిన వారే ఎక్కువ శాతం మద్యంతాగి వాహనాలను నడిపినట్లు గుర్తించారు. ఇప్పటికైనా ప్రజలు మారాలని సూచిస్తున్నారు.
News November 10, 2025
అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.


