News February 3, 2025
కోట్ పల్లి: పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

పార్టీ పటిష్టతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంతోష రాజు ఎంపిక కావడంతో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి నియామక పత్రాన్ని వారికి అందజేశారు. మహిళలను భాగస్వామ్యం చేస్తూ పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు.
Similar News
News January 16, 2026
14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.
News January 16, 2026
దుర్గమ్మవారి పూజకు పోరంకి గోశాల పాలు

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే శ్రీ చక్ర నవార్చణ పూజలో ఆలయ అధికారులు కీలక మార్పు చేశారు. పూజా కార్యక్రమాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ, ఇకపై పోరంకిలోని దేవస్థానం గోశాల నుంచి సేకరించిన తాజా ఆవు పాలు మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు. శాస్త్రీయ పద్ధతిలో, నాణ్యమైన పాలు పూజలకు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
News January 16, 2026
242 బెట్టింగ్ సైట్లు బ్లాక్

ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. చట్టవిరుద్ధమైన 242 సైట్ల లింక్లను బ్లాక్ చేసింది. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం 7,800 ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను నిషేధించింది. వీటి వల్ల సమాజానికి నష్టం జరుగుతోందని, యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.


