News October 7, 2024
కోట సీడీపీఓ మునికుమారికి మెమో జారీ
కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ మునికుమారికి సోమవారం మెమో జారీ చేసినట్టు తిరుపతి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కోట ప్రాజెక్టు పరిధిలోని 9 సెక్టార్ల పరిధిలో గల 200 మంది ఆయాలచే కోటలోని ప్రాజెక్టు కార్యాలయంలో బాత్రూములు, మరుగుదొడ్లు కడిగించడం, కార్యాలయం, ఆవరణమంతా శుభ్రం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, ముగ్గులు వేయించడం చేశారు. దీంతో మెమో జారీ చేసినట్లు తెలిపారు.
Similar News
News October 8, 2024
అయోమయ పరిస్థితిలో కాకాణి: బొబ్బేపల్లి
సర్వేపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఓటమితో కాకాణి గోవర్ధన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఆయన మాట్లాడారు. కాకాణి చేసిన అక్రమాల ఆనవాళ్లు సర్వేపల్లిలో ఇంకా చెక్కు చెదరలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇప్పుడు రోజూ ప్రెస్ మీట్లతో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
News October 7, 2024
అయోమయ పరిస్థితిలో కాకాణి: బొబ్బేపల్లి
సర్వేపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఓటమితో కాకాణి గోవర్ధన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఆయన మాట్లాడారు. కాకాణి చేసిన అక్రమాల ఆనవాళ్లు సర్వేపల్లిలో ఇంకా చెక్కు చెదరలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇప్పుడు రోజూ ప్రెస్ మీట్లతో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
News October 7, 2024
జిల్లాలో 350 వాహనాలు స్వాధీనం: నెల్లూరు SP
అనుమతి పొందిన వాహనాల్లోనే ఇసుక రవాణాను అనుమతిస్తామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక యార్డుల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 350 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. నిబంధనల మేరకే ఇసుక రవాణా జరగాలన్నారు.