News April 10, 2025
కోఠిలో ఉచితంగా రూ.12 లక్షల ఆపరేషన్..!

పలు కారణాలతో చిన్నపిల్లలకు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంటున్నట్లు కోఠి ENT ఆసుపత్రి డాక్టర్ వీణ తెలిపారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా పిల్లలు వినికిడి లోపాన్ని అధిగమించే అవకాశం ఉందని, రూ.12 లక్షలు ఖర్చు చేసే దీనిని ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా కోఠి ఆసుపత్రిలో 60 నుంచి 70 సర్జరీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.# SHARE IT
Similar News
News December 7, 2025
సికింద్రాబాద్ పేరెలా వచ్చిందంటే?

సికింద్రాబాద్ పేరు వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. 1798లో 2వ నిజాం అలీఖాన్ బ్రిటిషర్లతో ‘సైన్య సహకార ఒప్పందం’ కుదుర్చుకున్నారు. దీని ప్రకారం బ్రిటిష్ సైన్యం నిజాంకు రక్షణగా ఉంటుంది. వారి కోసం కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు. కాలక్రమేణా బ్రిటిష్ సైన్యం విస్తరించి, వారి ప్రభావం పెరిగింది. దానిని తగ్గించేందుకు 3వ నిజాం సికిందర్ జా 1806లో ‘ఉలుమ్’ అనే ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్’గా మార్చుతూ ఫర్మానా జారీ చేశారు.
News December 7, 2025
HYD: జుట్టు ఊడుతోందా? మీకోసమే!

నగరవాసులకు ఒత్తైన జుట్టు కలగా మారుతోంది. మనోళ్లని హెయిర్లాస్, చుండ్రు తీవ్రంగా వేధిస్తున్నాయి. 30ఏళ్లలోపు 60% మందికి బాల్డ్హెడ్, 30% మందికి జట్టురాలుతోందని ఓ సర్వే వెల్లడించింది. ఒత్తిడి, హార్డ్ వాటర్కు VIT-D, VIT-B12 లోపాలు తోడవుతున్నాయి. VIT-D కణాలు ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. ఎండతగలకుండా ఉదయాన్నే ఆఫీస్కు చేరుకునేవారిలో VIT-D లోపం, మూడ్ స్వింగ్స్, బరువుపెరుగుదల ఉంటాయని వివరించింది.
News December 7, 2025
వామ్మో! HYDలో భారీగా పెరిగిన ధరలు

నగరంలో గుడ్ల ధరలు కొండెక్కాయి. విడిగా కొంటే గుడ్డు రూ.8- 9 వరకు అమ్ముతున్నారు. డజన్ రూ.90కి, ట్రే 220- 230 వరకు విక్రయిస్తున్నారు. ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్లో ఎగ్ డీలర్స్ వద్ద స్టాక్ లేకపోవడం ధరల ఎఫెక్ట్ కనిపిస్తోంది. వర్కవుట్స్ చేసే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ సోర్స్ గుడ్డే..త్వరగా కర్రీ చేసుకునే బ్యాచిలర్లు ఇబ్బందిగానే మారిందంటున్నారు. 3వారాలుగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.


