News May 23, 2024

కోడుమూరులో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి

image

కోడుమూరు శివారులోని గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరియాణాకు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందగా.. 20మందికి పైగా గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News October 13, 2024

దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత.. 70 మందికిపైగా గాయాలు?

image

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. కర్రల సమరంలో హింస చెలరేగింది. దేవతామూర్తులు మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్లాడారు. దీంతో సుమారు 70 మందికిపైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

News October 12, 2024

కర్రల సమరానికి సిద్ధమైన ‘దేవరగట్టు’

image

హోళగుంద మండల పరిధిలోని దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కర్రల సమరం వీక్షించేందుకు పల్లెజనం ఇప్పటికే భారీగా దేవరగట్టు చేరుకున్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బన్నీ ఉత్సవాలకు ఎస్పీ బిందు మాధవ్ 800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలు, 5 డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచారు.

News October 12, 2024

కర్నూలు జిల్లాలో కిలో టమాటా @రూ.20

image

కర్నూలు జిల్లాలో ఇటీవల రూ.100 పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా ధర రూ.20కి పడిపోయింది. కాగా ఇటీవల టమాట ధరలు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడి కేంద్రాల్లో తక్కవ ధరలకే టమాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.