News February 6, 2025
కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడని, తెల్లారెసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2026
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నూతన కలెక్టర్

యాదాద్రి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం స్వామివారిని దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో భవాని శంకర్ ఘనస్వాగతం పలికారు. స్వయంభూవులను దర్శించుకున్న కలెక్టర్కు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు రఘు తదితరులు పాల్గొన్నారు.
News February 26, 2026
లక్ష్యం దిశగా రుణాల పంపిణీ: కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 2971.20 కోట్ల రుణాలను లక్ష్యంగా నిర్ణయించగా, డిసెంబర్ నాటికి రూ. 1937.21 కోట్లు (సుమారు 65%) పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
News February 26, 2026
VZM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 508 గైర్హాజరు

విజయనగరం జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షను 19,436 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 18,928 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 508 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.


