News February 6, 2025
కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడని, తెల్లారెసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు సహకరించాలి: కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యాలు పూర్తిచేయడంలో బ్యాంకర్లు మరింత చురుకుదనంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశంలో ఆయన బ్యాంకర్లు, జిల్లా శాఖాధికారులతో రుణాల పురోగతిని సమీక్షించారు. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య వివిధ రంగాల్లో రుణాల విడుదల వివరాలు కలెక్టర్ వెల్లడించారు.
News December 7, 2025
HNK: రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా?

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో క్యూఆర్ కోడ్ ద్వారా పెట్టుబడి పేరుతో పంపిన డబ్బు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఈ నెల 3న పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు పెద్దమొత్తంలో ఉండటంతో నేషనల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.
News December 7, 2025
మునగాకు కషాయంతో బోలెడు ప్రయోజనాలు!

మునగాకు కషాయంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫ్రెష్ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి మరిగించాలి. అవి మెత్తబడ్డాక వడకట్టి తాగాలి. మునగాకులను ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా కషాయం చేసుకోవచ్చు. రోజూ పరగడుపున ఒక గ్లాసు ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్, BP, కొవ్వు, జీర్ణ సమస్యల్ని నియంత్రిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి’ అని చెబుతున్నారు.


