News February 6, 2025
కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2025
బెల్లంపల్లి: ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల పరీక్ష పత్రం తారుమారు

బెల్లంపల్లిలోని సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో శుక్రవారం ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల భవ్య శ్రీ అనే విద్యార్థినికి 10వ తరగతి మొదటి రోజు తెలుగు పరీక్ష పత్రం తారుమారైంది. కాగా, ఆమె బెల్లంపల్లి మండలంలోని చాకేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల ఇలా జరిగిందన్నారు.
News March 22, 2025
‘మాంసం, కూరగాయల క్లస్టర్గా అనకాపల్లి జిల్లా’

అనకాపల్లి జిల్లాలో మాంసం, కూరగాయల క్లస్టర్గా ప్రభుత్వం ప్రకటించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో డీడీసీ, డీఎల్ఆర్సీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ తదితర ఉపాధి రంగాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ రంగాల్లో వచ్చే ఏడాదికి 17% వృద్ధి సాధించే విధంగా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.
News March 22, 2025
వృద్ధురాలిపై అత్యాచారయత్నం

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు మధ్యాహ్నం తన కల్లంలో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి అక్కడికొచ్చి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రాగానే.. అతడు పరారయ్యాడు. పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.