News February 6, 2025
కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 15, 2026
ఆకర్షణగా ‘I ❤️ MULUGU’

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘I ❤️ MULUGU’ సైన్బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సైన్బోర్డు పట్టణ అందాన్ని మరింత పెంచింది. స్థానికులు, సందర్శకులు ఇక్కడ ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ములుగు పట్టణానికి గుర్తింపుగా ఇది మారుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
News January 15, 2026
మునగ సాగుతో ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఉమేశ్ సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 15, 2026
NGKL: పండుగ రోజు విషాదం.. బావిలో శవాలై తేలారు.!

పండుగ వేళ కొల్లాపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన వరలక్ష్మి(18), లావణ్య(12) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన లావణ్య మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. పోలీసులు మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో చుక్కాయపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


