News April 7, 2025

కోడేరు: మురుగు కాలువలో పడి యువకుడు మృతి

image

మూర్చ వ్యాధితో యువకుడు ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి మృతి చెందిన ఘటన కోడేరులో ఆదివారం ఉదయం చోటుచేసుకంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కోడేరు క చెందిన మిద్దె మహేష్ (20) అనే యువకుడు గత కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళుతుండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి ప్రధాన రహదారి పక్కల ఉన్న మురుగు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News January 8, 2026

ధనుర్మాసం: ఇరవై నాలుగో రోజు కీర్తన

image

ఈ పాశురం కృష్ణుని గాథలు, గుణాన్ని కొనియాడుతోంది. రావణుని గెలిచిన రాముడికి, కృష్ణుడికి గోపికలు మంగళాశాసనాలు పలుకుతున్నారు. ‘గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ కరుణకు, శత్రువులను చెండాడు నీ సుదర్శన చక్రానికి జయం కలుగుగాక’ అని కీర్తిస్తున్నారు. ‘స్వామి! నీ వీరగాథలను స్తుతిస్తూ, మా నోముకు కావాల్సిన పరికరాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు’ అని గోపికలు వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 8, 2026

కృత్రిమ ఊపిరితిత్తులు.. IITH పరిశోధనలు

image

ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఐఐటీ హైదరాబాద్ ఓ శుభవార్త అందించింది. కృత్రిమ ఊపిరితిత్తుల అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపింది. జర్మనీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్‌తో కలిసి ఈ పరిశోధనలు చేయనుంది. అవయవ మార్పిడి అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా IIT హైదరాబాద్ పని చేస్తోంది. విజయవంతమైతే త్వరలోనే ఆర్టిఫీషియల్ లంగ్స్ అందుబాటులోకి రానున్నాయి.

News January 8, 2026

ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య

image

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే టెస్ట్ చేపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.