News April 5, 2025
కోదాడ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కోదాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. నల్గొండ మండలం దోనకల్ గ్రామానికి చెందిన సైదులు(31) బోర్వెల్స్లో పని చేస్తూ జీవిస్తున్నాడు. పని నిమిత్తం యజమాని కోదాడకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో గురువారం సైదులుకి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి భార్య నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News October 23, 2025
దశ మారనున్న దాచేపల్లి..!

హైదరాబాద్కు అమరావతిని కనెక్ట్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే 3.4 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చెన్నై రైల్వే కారిడార్కు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న దాచేపల్లి కేంద్రం కానున్నది. గంటకు 350 కిలోమీటర్ల స్పీడ్తో నడిచే బుల్లెట్ ట్రైన్కు దాచేపల్లిలో ప్రత్యేక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎస్సిఆర్ ఇప్పటికే డిపిఆర్ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
News October 23, 2025
పాన్గల్: కొత్త అల్లుడికి 150 రకాలతో భోజనం

దీపావళి సందర్భంగా మొదటిసారి వచ్చిన కొత్త అల్లుడికి అత్తామామలు సర్ప్రైజ్ ఇచ్చారు.150కి పైగా వెరైటీలతో విందు భోజనం ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. పాన్గల్ మండల పరిధిలోని రేమద్దుల గ్రామానికి చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక దంపతుల కూతురు శిరీషకు అదే గ్రామానికి చెందిన మహంకాళి మహేశ్కు వివాహమైంది. దీపావళి సందర్భంగా మహేశ్ అత్తగారింటికి రావడంతో వివిధ రకాల వెరైటీలతో విందు ఏర్పాటు చేశారు.
News October 23, 2025
ధాన్యం కొనుగోళ్లకు మార్గదర్శకాలు జారీ

AP: 51 లక్షల టన్నుల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులకు నూటికి నూరుశాతం మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఈ-పంట డేటా ప్రకారం ముందే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్దేశించింది. ఏ మిల్లుకు ధాన్యం పంపాలనే స్వేచ్ఛను రైతులకు కల్పించింది. ఖరీఫ్ ధాన్యం క్వింటాకు సాధారణ రకానికి రూ.2369, గ్రేడ్-A రకానికి రూ.2,389 మద్దతు ధర కల్పించింది.