News March 1, 2025

కోదాడ‌: కలకలం రేపుతున్న మైనర్ మిస్సింగ్

image

కోదాడ‌లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వివరాలిలా.. మేళ్లచెర్వు మండలానికి చెందిన బాలికకు కోదాడకు చెందిన పదో తరగతి అబ్బాయి స్నాప్‌చాట్‌లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలిక అతడిని కలవడానికి ఇంట్లో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి కోదాడకు వెళ్లింది. ఆరు రోజులైనా తిరిగి రాకపోవడంతో బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలుడిని విచారిస్తున్నట్లు తెలిపారు. 

Similar News

News March 1, 2025

HYD: ఎల్బీనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం..!

image

HYDలో ట్రాన్స్‌జెండర్లు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. తమ ప్రతిభను చాటి చెబుతూనే పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ ఉద్యోగాలకు సైతం వారిని ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. GHMC & MEPMA సహకారంతో, అర్ధనారి ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం HYD ఎల్బీనగర్‌లో ఏర్పాటు జరగగా వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.

News March 1, 2025

కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన

image

ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో జరుగుతున్న భూ రీసర్వేను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం పరిశీలించారు. ఎమ్మార్వో శేషఫణితో కలిసి రీ సర్వేలో రైతుల నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకున్నారు. మండలంలో నెలకొన్న భూ, తదితర సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు.

News March 1, 2025

GHMCలో 139 మంది శానిటేషన్ జవాన్ల బదిలీ.!

image

GHMC కమిషనర్ ఇలంబర్తి 139 మంది శానిటేషన్ జవాన్లను బదిలీ చేశారు. మొత్తం 259 మంది సిబ్బందిలో ఐదేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్న వారిని మార్చినట్లు తెలిపారు. నగర శుభ్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శానిటేషన్ సేవల్లో సమర్థత పెంచేందుకు ఈ చర్యలు అవసరమని కమిషనర్ స్పష్టం చేశారు. 

error: Content is protected !!