News February 3, 2025

కోదాడ: తాగిన మైకంలో ఉరేసుకొని యువకుడి సూసైడ్

image

ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కోదాడలోని లక్ష్మీపురం కాలనీలో జరిగింది. టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాలు.. కొండపల్లి జయంత్ (28) శిరీష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి జయంత్ తాగిన మైకంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 14, 2025

NOV. 17 నుంచి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, 16వ తేదీన అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా 17వతేది ఉదయం ధ్వజారోహణం, 21న గజవాహనం, 22న గరుడ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమీతీర్థం జరగనుంది.

News October 14, 2025

విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

image

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్‌‌కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.

News October 14, 2025

TU: అదుపు తప్పిన ఉపకులపతి కారు

image

టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరి రావు ప్రభుత్వ వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం ఉపకులపతి పరిపాలనా భవనం వద్దకు చేరుకొని, తన సొంత పనుల నిమిత్తం వాహనంలో ఆయన భార్యను నిజామాబాద్‌కి పంపించారు. తిరిగి వస్తుండగా కంఠేశ్వర్ బైపాస్ వద్ద అదుపు తప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గమనించిన స్థానికులు వాహనాన్ని రోడ్డుకు చేర్చారు.