News February 3, 2025

కోదాడ: తాగిన మైకంలో ఉరేసుకొని యువకుడి సూసైడ్

image

ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కోదాడలోని లక్ష్మీపురం కాలనీలో జరిగింది. టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాలు.. కొండపల్లి జయంత్ (28) శిరీష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి జయంత్ తాగిన మైకంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2025

అంతర్జాతీయ పోటీల్లో నిర్మల్ బిడ్డల ప్రతిభ

image

ఇటీవల దిల్లీలో నిర్వహించిన నాలుగో ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కిక్ బాక్సింగ్ సెక్రటరీ మహిపాల్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన అక్షయ, నాగలక్ష్మితో పాటు జట్టును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు, శిక్షకులు తదితరులున్నారు.

News February 13, 2025

పంచాయతీ ఎన్నికలను సన్నద్ధం కావాలి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం నియమించిన స్టేజ్ 1, స్టేజ్ స్టేజ్‌2 నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక సూచనలు అందించారు.

News February 13, 2025

ముప్కాల్: హైవేపై యాక్సిడెంట్ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వయసు సుమారు 50-60 మధ్యలో ఉంటుంది. అతను తెల్ల చొక్కా లుంగీ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించలన్నారు.

error: Content is protected !!