News March 30, 2025

కోదాడ నుంచి హుజూర్‌నగర్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు

image

సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ పర్యటన నేపథ్యంలో ఆదివారం కోదాడ నుంచి వయా హుజూర్‌నగర్, మిర్యాలగూడెం వెళ్లే వాహనాలను పోలీసులు మళ్లించారు. లారీలు, భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ RECORD

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అదే ఏడాది జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి TDPపై 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ దానిని బీట్ చేయలేకపోయారు. కానీ నవీన్ యాదవ్ ఈ ఉపఎన్నికలో 24,729 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ RECORD

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అదే ఏడాది జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి TDPపై 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ దానిని బీట్ చేయలేకపోయారు. కానీ నవీన్ యాదవ్ ఈ ఉపఎన్నికలో 24,729 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

News November 14, 2025

VKB: పోలీసు శాఖలో టెన్షన్.!

image

వికారాబాద్‌ జిల్లా పోలీసు యంత్రాంగంలో బదిలీల టెన్షన్ పట్టుకుంది. తాండూరు సబ్ డివిజన్‌కు సంబంధించిన పోలీసులపై చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అధికారులను బదిలీ చేస్తారా.. వేటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారిందని చర్చించుకుంటున్నారు. ఇద్దరు సీఐలు, పెద్దేముల్ ఎస్ఐ, బషీరాబాద్‌ ఎస్ఐల బదిలీ తప్పదని ప్రచారం జరగుతోంది. తాండూర్ డీఎస్పీగా నేడు నర్సింగ్ యాదయ్య బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం.