News March 30, 2025
కోదాడ నుంచి హుజూర్నగర్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు

సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్ పర్యటన నేపథ్యంలో ఆదివారం కోదాడ నుంచి వయా హుజూర్నగర్, మిర్యాలగూడెం వెళ్లే వాహనాలను పోలీసులు మళ్లించారు. లారీలు, భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
వరంగల్: ఈత కల్లు సీజన్ షురూ..!

ఓరుగల్లు జిల్లాలో తాటికల్లుకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తాటికల్లు సీజన్ పూర్తై, ఈతకల్లు సీజన్ మొదలవుతోంది. గౌడన్నలు ఈదులను గీయడంతో కల్లు పారడం మొదలైంది. దసరా నాటికి పూర్తి స్థాయిలో కల్లు అందుబాటులోకి వస్తుంది. ఉమ్మడి జిల్లాలోని గోపనపల్లి, కల్లెడ, గట్టికల్, పాలకుర్తి, పాకాల, మడిపల్లి, కంఠాత్మకూర్, శాయంపేట, ఆత్మకూర్, బ్రాహ్మణపల్లి, వల్మిడి, తాల్లపూపల్లి వంటివి కల్లుకు ఫేమస్ ప్లేసులు.
News September 18, 2025
ADB: ఇక పల్లె రహదారులపై రయ్ రయ్..!

ఉమ్మడి ఆదిలాబాద్లోని జిల్లా కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలకు రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం భారీగా నిధులు మంజూరయ్యాయి. మొదటి దశలో భాగంగా పలు రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 30 రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.659.97 కోట్లకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రానికి అనుసంధానం కాని గ్రామాలు, మండలాలను కలుపుతూ కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మరమ్మతులు చేపట్టనున్నారు.
News September 18, 2025
అరాచకమే.. సందీప్ వంగాతో మహేశ్ మూవీ?

రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు చేసే మూవీ విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయాలని మహేశ్ను సునీల్ కోరినట్లు తెలిపాయి. కాల్షీట్ల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నాయి. దీంతో సందీప్, మహేశ్ కాంబినేషన్ కుదిరితే అరాచకమేనని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.