News April 15, 2025
కోదాడ: పందెం కోడికి శస్త్ర చికిత్స

కోదాడలో కుక్కల దాడిలో కోడి గాయపడింది. ఎడమ రెక్క ఎముక రెండుగా చీలి పోయింది. యజమాని వైద్యం కోసం కోదాడ పశువైద్యశాలకు తీసుకువచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ డా.పెంటయ్య అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి రెండుగా పగిలిపోయిన ఎముకలను అతికించారు. యజమాని సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News December 24, 2025
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 26,210 వద్ద.. సెన్సెక్స్ 89 పాయింట్లు పెరిగి 85,611 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ఫైనాన్స్, NTPC, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్బ్యాంక్ షేర్లు లాభాల్లో.. టెక్మహీంద్రా, ఇన్ఫీ, TMPV, సన్ఫార్మా, HCL టెక్ నష్టాల్లో ఉన్నాయి.
News December 24, 2025
విత్తనాలు కొనేటప్పుడు రశీదు కీలకం

విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు మరియు డీలర్ సంతకం తప్పకుండా ఉండాలి. పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే ఆ రశీదును పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత రాకపోతే నష్టపరిహారానికి రశీదు అవసరం.
News December 24, 2025
ఫిట్నెస్ ఫీజుల పెంపునకు బ్రేక్

AP: రవాణా లారీలకు ఫిట్నెస్ ఫీజుల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్తో 15 ఏళ్లు దాటిన లారీలకు రూ.36 వేల వరకు భారం పడుతోంది. దీంతో లారీ యజమానులు వాహనాలు నిలిపివేస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం <<18515219>>చర్చలు జరిపి<<>> వారికి హామీ ఇచ్చింది. తాజాగా పెంపు నిర్ణయాన్ని నిలిపివేసింది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.


