News February 3, 2025
కోదాడ స్కూల్ నుంచి స్టూడెంట్స్ పరార్.. పట్టుకున్న పోలీసులు

కోదాడ మం. నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పారిపోవడం ప్రభుత్వ యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఎస్సై అనిల్ రెడ్డి వివరాలు.. పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పారిపోగా ప్రిన్సిపల్ ఝాన్సీ PSలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 26, 2026
సిద్దిపేట: 3,887 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 40 గ్రామాల్లోని 1,998 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 3,887 ఎకరాల్లో మొక్కజొన్న(2,356 ఎకరాలు), సన్ఫ్లవర్(1,531 ఎకరాలు) పంటలు దెబ్బతిన్నాయి. తొగుట మండలంలో డీఏవో స్వరూప రాణి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. ఈ నివేదికను కలెక్టర్కు సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధితులను ఆదుకుంటామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.
News February 26, 2026
‘టాక్సిక్’ రన్టైమ్ షాక్.. 2 పార్ట్లుగా రానుందా?

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ రన్టైమ్పై వస్తున్న వార్తలు ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ భారీ గ్యాంగ్స్టర్ డ్రామా నిడివి కేవలం 2:20 గంటలేనన్న టాక్ నడుస్తోంది. ఇంత తక్కువ టైమ్లో భారీ కథను చూపించడం కష్టమని అందుకే రెండు పార్ట్లుగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే చర్చ మొదలైంది. ఒకవేళ రన్టైమ్ నిజంగా తక్కువే ఉంటే ‘టాక్సిక్ 2’ పక్కా అని SMలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
News February 26, 2026
గురువార వ్రత కథ

దయావంతుడనే ధనవంతుడు దానధర్మాలు చేసేవాడు. భార్యకు ఇవేం ఇష్టం లేదు. ఓరోజు బృహస్పతి సాధువుగా వచ్చి భిక్ష అడిగాడు. ఆమె సంపదంతా పోయి ప్రశాంతంగా ఉండాలని కోరింది. సాధువు చెప్పినట్లు ఆమె ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి, దరిద్రం అనుభవించింది. ఆ తర్వాత పొరుగున ఉన్న పుణ్యస్త్రీ సలహాతో తన తప్పు తెలుసుకుని ఈ వ్రతం చేసింది. దీంతో బృహస్పతి ప్రసన్నుడై వారికి తిరిగి ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు.


