News July 19, 2024

కోనసీమ: అరుదైన చేపలు ఇవి.. భలే టేస్ట్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పెరిగింది. వాగులు, కాలువల్లోకి గోదావరి నీరు చేరుతుండటంతో ఈ సీజన్‌లో మాత్రమే కనిపించే ‘చీరమేను’ రకం చేపలు లభ్యమవుతున్నాయి. వరదల సమయంలో దొరికే ఈ చేపలకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువ. ఈ చిన్ని చేపల రుచి అమోఘంగా ఉంటుందని గోదావరి జిల్లా వాసులు చెబుతుంటారు. అయితే.. ఇవి మామూలు వలలకు చిక్కవు. దోమతెరల వంటి ప్రత్యేక వలలతో పడతారంట.

Similar News

News November 6, 2025

ధాన్యం సేకరణ సందేహాలపై కంట్రోల్ రూమ్: కలెక్టర్

image

ఖరీఫ్‌ సీజన్‌లో వరి సేకరణ 4 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా ఇప్పటి వరకు రైతుల నుంచి మొత్తం15.64 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు సంయుక్త కలెక్టర్ వై. మేఘ స్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సందేహాలకు, ఫిర్యాదులకు కలెక్టర్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ నంబర్ 83094 87151కు సంప్రదించవచ్చన్నారు.

News November 6, 2025

రాజమండ్రి: ఈనెల 7 జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఈనెల 7 శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేళాలో బీఓబీ, ఎస్‌బీఐ పేమెంట్స్, భరత్ పే వంటి పలు సంస్థలలోని ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ పూర్తిచేసిన, 19 నుంచి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

News November 5, 2025

రాజమండ్రి: పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు ఆహ్వానం

image

జిల్లాలో పర్యాటక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పి. వెంకట చలం బుధవారం ప్రకటించారు. జలక్రీడలు, సాహస క్రీడలు, లగ్జరీ హౌస్ బోట్లు, పార్టీ బోట్ల వంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి గల వారు www.tourism.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చని, లేదా 9505011951 / 6309942025 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.