News April 12, 2025

కోనసీమ: ఏప్రిల్ 15 నుంచి సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం

image

ఏప్రిల్ 15 తేదీ నుంచి జూన్ 14 వరకు సముద్ర జలాల్లో చేపల వేటను ప్రభుత్వం నిషేధం విధించినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు, మేకనైజిడ్, మోటారైజ్డ్ బోట్లు ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను నిలిపివేయాలన్నారు. 61 రోజులు పాటు చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Similar News

News December 8, 2025

తిరుచానూరు: ఆయన పేరు కలెక్షన్ కింగ్ అంటూ చర్చ..!

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తీర్థం, శఠారి ఇస్తూ వీఐపీల నుంచి, సామాన్య భక్తుల నుంచి సంబంధిత అనధికారిక స్వామి కానుకలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జీతం లేని వ్యక్తికి ప్రతిరోజు కలెక్షన్ వేల రూపాయల ఆదాయం అని తెలుస్తుంది. ఇంత జరుగుతుంటే విజిలెన్స్ అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్న. దీని వెనుక ఓ కీలక వ్యక్తి ఉన్నట్లు సమాచారం.

News December 8, 2025

జగిత్యాల: ‘గ్రీవెన్స్ డేలో ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం’

image

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ అశోక్ కుమార్, వచ్చిన ఆరుగురు అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేస్తూ, స్టేషన్లలో వినతులను మర్యాదగా స్వీకరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.

News December 8, 2025

చాట్రాయి: సామాన్యుల సమస్యలపై స్పందించిన మంత్రి

image

చనుబండలో సామాన్యులు చెప్పిన సమస్యలపై తక్షణమే స్పందించిన మంత్రి కొలుసు సారథి, సొంత ఖర్చులతో డ్రైనేజీలో తూరలు వేయించారు. సోమవారం చనుబండలో మంత్రి ఈ పనులు పూర్తి చేయించడంతో బలహీన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత 48 గంటల క్రితం మంత్రి గ్రామానికి వచ్చిన సందర్భంలో ప్రజలు సమస్యను ప్రత్యక్షంగా చూపించారని, వెంటనే పనులు పూర్తి చేయడం సంతోషదాయకంగా ఉందని పలువురు పేర్కొన్నారు.