News March 6, 2025

కోనసీమ : కల్లు గీత కార్మికుల మద్యం షాపులకు లాటరీ

image

కలెక్టరేట్‌ గోదావరి భవనంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కల్లు గీత కార్మికుల మద్యం షాపుల ఎంపిక కోసం గురువారం ఉదయం 11 గంటలకు లాటరీ నిర్వహిస్తున్నట్లు అమలాపురం ఎక్సైజ్‌ సూపర్‌రిండెంట్‌ ఎస్‌కేడీవీప్రసాద్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో షాపుల టెండర్లను జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ అధ్వర్యంలో లాటరీ తీస్తామన్నారు. 13 మద్యం షాపులకు గాను 261 టెండర్లు వచ్చాయని ప్రసాద్‌ తెలిపారు.

Similar News

News December 22, 2025

కర్నూలు: 633 మందికి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

image

శిక్షణే ఒక పోలీసు భవిష్యత్‌కు పునాదని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవే నిజమైన పోలీసు శక్తి” అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం అన్నారు. కర్నూల్ APSP రెండవ బెటాలియన్ శిక్షణా కేంద్రం, DTC కర్నూలులో 633 మంది స్టైపిండరీ కానిస్టేబుళ్లకు 9నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కాలంలో ప్రతి రిక్రూట్ బాధ్యతాయుతమైన, ప్రజాభిముఖ పోలీసుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.

News December 22, 2025

MNCL: లోక్ అదాలత్‌లో 4411 కేసులు పరిష్కారం

image

21న జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం 4411 కేసులు పరిష్కరించామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. 59 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ.53,24,105 తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు. టార్గెట్‌కు మించి కేసులు పరిష్కరించబడడం పట్ల కమిషనరేట్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, మానిటర్ చేసిన అధికారులకు, త్వరలో రివార్డ్స్ అందజేస్తామన్నారు.

News December 22, 2025

ప.గో జిల్లాలో యూరియా కొరత లేదు: జేసీ

image

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.