News February 16, 2025
కోనసీమ: గుడ్డుకీ గడ్డు కాలం..భారీగా పడిపోయిన ధర

బర్డ్ ప్లూ దెబ్బకు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. రూ.4.90 గుడ్డు ధర రూ.4.55కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. ట్రెడర్లు బర్డ్ ప్లూ పేరుతో కొంత మేర ధర తగ్గించినట్లు చెబుతున్నారు.
Similar News
News February 23, 2026
రోజూ గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

గుమ్మడి గింజల్లో ప్రొటీన్స్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ 30 గ్రాములు తింటే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, సంతాన సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, PCOS, థైరాయిడ్, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా అవుతాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. మంచి నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
News February 23, 2026
నిజామాబాద్: కానిస్టేబుల్ సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం

గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె తమ్ముడు గాజుల శ్రవణ్కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సౌమ్య కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందజేశారు. మాట ఇచ్చిన నెల రోజుల్లోపే ఉద్యోగం, ఆర్థిక సాయం అందించారు.
News February 23, 2026
కనువిందుగా రామయ్య నిత్య కళ్యాణ వేడుక

భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.


