News March 25, 2025

కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: జేసీ

image

రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జేసీ నిశాంతి సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ ఉద్యోగులతో ఆమె మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ పరిపాలన అంశాలపై ఫైలింగ్ నిర్వహణ విధివిధానాలు పట్ల వారికి ఆమె అవగాహన కల్పించారు. భూ సంబంధిత సమస్యలపై తహశీల్దారులు, ఆర్డీవోలు విచారణ జరిపి కలెక్టరేట్‌కు నివేదిక అందించాలన్నారు.

Similar News

News October 21, 2025

నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

image

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, UAEలలో 3 రోజులు పర్యటిస్తారు. వచ్చేనెల విశాఖలో జరిగే CII సదస్సుకు రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. CM వెంట మంత్రులు TG భరత్, జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు.

News October 21, 2025

నాడు వణికిన అదిలాబాద్

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ను వణికించిన నక్సల్ దాడుల్లో పోలీసుల త్యాగాలు మరువలేనివి. 1987 ఆగస్టు 18న కడెం మండలం అద్దాల తిమ్మాపూర్ వద్ద సాగర్ దళ కమాండర్ మాటువేసి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఎస్సైలతో సహా 10 మంది పోలీసులు అమరులయ్యారు. 1989లో సింగాపూర్ వద్ద జీపు పేల్చివేతలో ఎస్సై ఖాదర్‌లాక్‌తో సహా ఏడుగురు, 1999లో తర్లుపాడ్ పేలుడులో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

News October 21, 2025

శివోహం.. తూ.గో. జిల్లాలో దర్శనీయ ఆలయాలు

image

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం రేపటి నుంచి (బుధవారం) ప్రారంభం కానుంది. ఈ నెలలో తూ.గో. జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
★ ద్రాక్షారామ భీమేశ్వరస్వామి
★ సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి
★ కోటిపల్లి సోమేశ్వరాలయం
★ ముక్తేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయం
★ కొవ్వూరులోని బ్రహ్మసూత్ర లింగేశ్వర ఆలయం
గోదావరి తీరాన కార్తీక దీపాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది.