News February 16, 2025
కోనసీమ జిల్లాలో ఒక్క కేసు కూడా లేదు : కలెక్టర్

కోనసీమ జిల్లాలో మాత్రం ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీల్లో 24 లక్షల కోళ్లు ఉన్నాయని, 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర జిల్లాల్లోని కోళ్ల ఉత్పత్తులు రానీయకుండా అరికట్టామన్నారు. ఇక్కడి మాంసం విక్రయదారులపై ఆంక్షలు విధించవద్దన్నారు. అంగన్వాడీ, పాఠశాలల్లో గుడ్లను బాగా ఉడికించి అందించాలని ఆదేశించారు.
Similar News
News November 18, 2025
10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
News November 18, 2025
ANU: థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం బిఈడి థర్డ్ సెమిస్టర్, పీజీ సైన్స్, ఆర్ట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్.ఎల్.బి పరీక్షలు ప్రారంభమయ్యాయి. థర్డ్ సెమిస్టర్ 22 పరీక్షా కేంద్రాల్లోను, ఎల్.ఎల్.బి గుంటూరులో మూడు పరీక్ష కేంద్రాలు, ప్రకాశం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలు తీరును పరిశీలించారు.
News November 18, 2025
లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎంకు సమన్లు

మైనర్పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ CM, BJP నేత BS యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది FEBలో మీటింగ్ కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన 17 ఏళ్ల కూతురిని యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈక్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.


