News April 11, 2025

కోనసీమ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడి పర్యటన

image

కోనసీమ జిల్లాలో రెండవ రోజు గురువారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ పర్యటించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జాయింట్ కలెక్టర్ నిశాంతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరు గురించి సమీక్షించారు. రెండు రోజుల కోనసీమ జిల్లా పర్యటనలో తాను శాఖల వారిగా గుర్తించిన లోపాలను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల దృష్టికి ఆయన తీసుకువచ్చారన్నారు.

Similar News

News November 19, 2025

అనకాపల్లి: 2,42,480 మంది ఖాతాల్లో నగదు జమ

image

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ అయినట్లు జేసీ జాహ్నవి తెలిపారు. సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమంలో జేసీ జాహ్నవి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి రైతుకు ఈ పథకం కింద నిధులు జమ చేయడం జరిగిందన్నారు. రైతులకు చెక్కులను అందజేశారు.

News November 19, 2025

‘కోటి చీరల’ పంపిణీపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

image

‘మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి’ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటి నుంచి డిసెంబర్ 9 లోపు పంపిణీ పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 19, 2025

అర్హులైన మహిళలందరికీ చీరలు అందాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, మహిళా సంఘాల ప్రతినిధులతో వీసీ నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో, సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హత గల మహిళకు చీర అందేలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పంపిణీ చేయాలని సూచించారు.