News March 29, 2025

కోనసీమ జిల్లాలో 404 రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు: జేసీ

image

రామచంద్రపురం పట్టణంలో పౌరసరపరాల జిల్లా మేనేజర్ బాల సరస్వతి ఆధ్వర్యంలో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల సరస్వతి మాట్లాడుతూ.. జిల్లా జేసీ నిశాంతి ఆదేశాల మేరకు జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు 404 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్య సేకరణ సమయంలో శాంపిల్స్ విశ్లేషణ, ప్రమాణాలు, తేమశాతం తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Similar News

News December 8, 2025

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు : పోలీసుల హెచ్చరిక

image

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 నుంచి No Helmet–No Petrol నిబంధన కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 45% మరణాలు బైకుల నిర్లక్ష్యంతో జరుగుతుండగా, హెల్మెట్ వాడితే 40% ప్రాణాలు నిలుస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల వాహనం నడుపుతున్నవారు, వెనుక కూర్చునే వారు ఇద్దరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

News December 8, 2025

టెట్ పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో 5, నరసాపురంలో 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News December 8, 2025

మహిళలకు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు: కలెక్టర్

image

మహిళలకు తగిన అవకాశం కల్పిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో, ఐదు రోజుల ఈవెంట్ మేనేజ్‌మెంట్ శిక్షణను పూర్తి చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను మహిళా SHG సభ్యులకు అప్పగించేలా అవకాశాలు కల్పించాలని DRDO సురేందర్‌ను ఆయన ఆదేశించారు.